telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం….

ycp Mla Gopireddy

ఏంఎల్ఏ గోపిరెడ్డి.శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరసరావుపేటలో తెదేపా..వైకాపాలో విలీనం ఐపోయిందని,పంచాయితి ఎన్నికల ఫలితాలే మా పనితీరుకు నిదర్శనమని ఆయన అన్నారు. లోకేశ్ ఒక పప్పు.లోకేశ్ నాయకత్వం మీద నమ్మకం లేకనే చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు, ఇసప్పాలెం లో అక్రమ నిర్మాణాలు తొలగించడంలో తన ప్రమేయం లేదని, అక్రమ నిర్మాణాలు  ఆపమంటూ డిసెంబరు నెలలోనే నోటీసులు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. గోగులపాడులో గెలిచింది మా అభ్యర్ధి,అలాంటప్పుడు ఓటు వెయ్యకపోవడం,కక్షసాధింపులు మెమెందుకు చేస్తామన్నారు. తెదేపా రాజకీయ లబ్ది కోసం ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడికి సిగ్గూ శరం లేదని మురుగు కాలవలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించడం తప్పా..?? అని ఎమ్మెల్యే ప్రశించారు. తెదేపా నాయకులు ఎంతో మంది మా ప్రభుత్వ హయాంలో వందలాది ఇళ్ళు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్ లు కట్టుకుంటున్నారని అన్నారు. ధైర్యం ఉంటే మీ పార్టీ నుండి ఎవరైనా సరే చర్చకు రండి అంటూ సవాల్ విసిరారు. చూడాలి మరి దీనికి వారు ఎలా సమాధానం చెప్తారు అనేది.

Related posts