telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

govt job notifications in andhrapradesh
ఏపీ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం విడుదల చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఏప్రిల్ 19న అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ నిర్వహిస్తామని తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తామని మంత్రి అన్నారు. 
ఏప్రిల్ 20న ఏపీ ఎంసెట్(కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో),  ఏప్రిల్‌ 26న ఐసెట్(ఎస్వీయూ ఆధ్వర్యంలో), మే 1 నుంచి ఏపీ పీజీసెట్ (ఏయూ ఆధ్వర్యంలో), మే 6న ఏపీ ఎడ్‌సెట్‌(ఎస్వీయూ ఆధ్వర్యంలో), మే 6న ఏపీ లా సెట్(ఎస్కేయూ ఆధ్వర్యంలో), మే 5 నుంచి ఏపీ పీఈ సెట్ (నాగార్జున యూనివర్శిటీ ఆధ్వర్యంలో) నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఆన్ లైన్ లోనే ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని గంటా వెల్లడించారు.

Related posts