telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

 స్వాతంత్ర్య  వేడుకలు ఈ సారి విశాఖలో!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈ సారి విశాఖపట్టణంలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పై మంత్రి అవంతి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్. మాట్లాడుతూ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల నిర్వహణకు అనుకూలమైన మైదానాన్ని పరిశీలిస్తున్నామనిత్తెలిపారు.

ఏయూ ఇంజినీరింగ్ మైదానం, బీచ్ రోడ్ ఈ రెండు ప్రదేశాలను పరిశీలించి, వీటిలో అనుకూలమైనది ఎంపిక చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇచ్చి అసెంబ్లీ నిర్వహణ అద్భుతంగా జరుగుతోందన్నారు. ప్రతిపక్ష శాసన సభ్యులు ఉన్న నియోజకవర్గాలకు త్రాగునీటి కోసం కోటి రూపాయలు నిధులు వైసీపీ ప్రభుత్వం కేటాయిస్తోందని పేర్కొన్నారు.

Related posts