వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విటర్ లో విమర్శనస్త్రాలు సందించారు. కలువకుంట్ల(లోట్సపాండ్)కే పరిమితమయ్యారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ‘జగన్ ఏపీలో అన్ని వ్యవస్థలపైనా నమ్మకం లేదని ఇదివరకే ప్రకటించారు. అలాగే ప్రవర్తించారు. ఏపీ ఎన్నికల కమిషన్పై నమ్మకం లేదని నామినేషన్లు కూడా తెలంగాణలోనే వేస్తారా? ఏపీలో ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలోని లోట్సపాండ్లో వైసీపీ నేతలతో జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏపీలో ఎవరు రావాలి? ఎవరు కావాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరే తేల్చుకోండి’ అని ట్విటర్ లో పేర్కొన్నారు.
previous post