telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

చెరువులో స్నానానికని వెళ్లి ఆరుగులు చిన్నారులు మృతి

చెరువులో స్నానానికని వెళ్లి ఆరుగులు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన బీహార్‌లోని ఛాప్రా జిల్లాలో జరిగింది. డొయిల్లా గ్రామానికి చెందిన ఏడుగురు చిన్నారులు స్థానిక చెరువుకు వెళ్లారు. వీరిలో ఆరుగురు మృతి చెందగా, ఒకరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన చిన్నారి కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఆరుగురు చిన్నారుల మృతితో డొయిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు.

Related posts