నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘అఖండ’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇప్పటికే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సినిమాల మాదిరిగానే.. ఈ సినిమాను కూడా ఎన్నో అంచనాలతో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యాజైశ్వాల్ కథానాయికగా నటించగా శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ , ట్రీజర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాను మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.. తాజాగా అఖండ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. పాటతో చిత్రీకరణ ముగిసిందని తెలియజేస్తూ సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశారు. త్వరలోనే థియేటర్లలో విడుదల అవుతుందని తెలిపారు. దీంతో బాలయ్య అభిమానులు అఖండ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.