టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా నటిస్తున్న సినిమా ‘తీస్ మార్ ఖాన్’.
కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో సునీల్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్లు, ఫస్ట్ సింగిల్కు మంచి స్పందన లభించింది.
తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు చిత్రయూనిట్ . ‘సమయానికే’ అంటూ సాగే ఈ మెలోడీ ట్యూన్కు రాకేందు మౌళి సాహిత్యం అందించగా శ్రుతి ఆలపించారు. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ వీడియో సాంగ్లో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్పుత్లు యూత్ ఆడియెన్స్ కట్టిపడేశారు.
ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న సినిమా ఆగస్ట్ 19న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది.