*హైదరాబాద్లో ఘోర రైలు ప్రమాదం..
*ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి..
*హైటెక్సిటీ రైల్వేస్టేషన్ దగ్గర ఘటన
*మృతులంతా వనపర్తి వాసులుగా గుర్తింపు..
హైదరాబాద్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ సమీపంలో రైల్వేట్రాక్ పై వెళ్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఎంఎంటీఎస్ రైలు ముగ్గురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
హైటెక్సిటీ రైల్వేస్టేషన్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులందరూ వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.