telugu navyamedia
క్రైమ్ వార్తలు

సాంబార్‌లో ప‌డి రెండేళ్ల చిన్నారి మృతి..

కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సాంబార్ గిన్నెలో ప‌డి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది.ఈ ఘ‌ట‌న విస‌న్న‌పేట ద‌ళిత వాడ‌లో చోటుచేసుకుంది.

ఇంట్లో త‌ల్లిదండ్రులు వేరే ప‌నిలో ఉన్నప్పుడు చిన్నారి ఆడుకుంటూ కూర్చిలోంచి సాంబ‌ర్ గిన్నేలో ప‌డిపోవ‌డంలో తీవ్రంగా గాయాలైన చిన్నారిని ఆస్పత్రికి త‌రిలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.అంత్య‌క్రియ‌లు కూడా జ‌రిగిపోయాయి.

ఈ ఘ‌ట‌న రెండురోజులు క్రిత‌మే జ‌రిగింది..ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది..పోలీసుల‌కు కూడా స‌మాచారం అంద‌లేదు.

Related posts