దేశంలో ఆదర్శవంతమైన పథకాలు తెచ్చిన ఘనత కేసీఆర్దేనని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సోమవారం కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు వస్తాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు..ఒక్క పైసా తీసుకోకుండా ప్రజలకు ఇండ్లు అందిస్తున్నామని, అర్హులైన వారందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
.రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని అన్నారు. అతి త్వరలోనే అందరికీ ఇవి అందజేస్తామని వెల్లడించారు.
ఎవరైనా ఇళ్ల కోసం డబ్బులు అడిగితే లాగి కొట్టండి. ఇళ్లు రాని వాళ్లు ఉంటే బాధపడవద్దు ..అధికారులే ఇళ్లకు వచ్చి మంజూరు చేస్తారని కేటీఆర్ తెలిపారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.8500 కోట్లు అందజేశామన్న కేటీఆర్… ఆడబిడ్డలకు 11లక్షల కేసీఆర్ కిట్లు అందించామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై కొందరు పనిలేక ఆరోపణలు చేస్తున్నారని…. వారు దేశంలో ఎక్కడైనా రెండు పడక గదుల ఇళ్లు ఉంటే చూపించాలని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు.
కేసీఆర్ మొండి మనిషి అని.. ఆయన ఏ పని చేపట్టినా పూర్తయ్యేదాకా వదలబోరని అన్నారు.