telugu navyamedia
క్రైమ్ వార్తలు

విశాఖ జిల్లాలో విషాదం..ఇద్ద‌రు చిన్నారుల‌తో స‌హా బావిలోకి దూకి త‌ల్లి..

*విశాఖ జిల్లాలో విషాదం..కుటుంబ క‌ల‌హాలే వ‌ల్ల ఈ ఘ‌ట‌న‌..
*ఇద్ద‌రు చిన్నారుల‌తో స‌హా బావిలోకి దూకి త‌ల్లి..
*ఇద్ద‌రు చిన్నారులు మృతి..
*పిల్ల‌ల మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీసిన స్థానిక‌లు..
*ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన త‌ల్లి..

విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి.. వారిని కాపాడే ప్రయత్నం చేయగా ఇద్దరు పిల్లలు అప్పటికే మృతి చెందారు. తల్లిని ప్రాణాలతో కాపాడగలిగారు. ఈ ఘటనలో మృతులు భాను (5), పృథ్వీ (3) లుగా గుర్తించారు.

కుటుంబ క‌ల‌హాలు కార‌ణంగానే ఇద్దరు చిన్నారులుతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. జిల్లాలోని రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పసిబిడ్డల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related posts