బ్రిటిష్ టూరిస్ట్, నటుడు మాథ్యూ ఫిలిప్స్ (44) జూన్లో లాగ్వేగాస్ టూర్కు వెళ్లి ఓ విషపూరితమైన సాలీడు కాటుకు గురయ్యాడు. ఆ విషయం అతడికి యాత్రలో ఉన్నన్ని రోజులు తెలియలేదు. టూర్ పూర్తి చేసుకొని తన హోం టౌన్ మాంచెస్టర్ వచ్చిన తరువాత ఫిలిప్స్కు పాదంపై ఎరుపు రంగులో చిన్న గాటు కనిపించింది. దాన్ని తేలికగా తీసుకున్నాడు ఫిలిప్స్. అయితే రోజులు గడిచే కొద్ది పాదంపై వాపు రావడం మొదలైంది. దాంతో అనుమానం వచ్చిన అతడు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఫిలిప్స్ను పరీక్షించి చూస్తే ఓ విషపూరిత సాలీడు కాటు వేసిందని తేలింది. అలాగే దాని విష ప్రభావం వల్ల పాదంలో కొంతమేర మాంసం కుళ్లిపోవడంతో పాటు కణాలు పూర్తిగా నశించిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి గోల్ఫ్ బాల్ సైజులో మాంసం ముద్దను తొలగించారు వైద్యులు. ఒకవేళ అలా చేయకపోతే మొత్తం కాలికే ప్రమాదం పొంచి ఉండేదన్నారు. ఇక ఫిలిప్స్కు కాటేసిన బ్రౌన్ రెక్లస్ సాలీడు కేవలం 3 నుంచి 4 అంగుళాల పరిమాణం కలిగి ఉంటుందట. కాని దాని విష ప్రభావం మాత్రం ప్రాణం తీస్తుందని ఈ సందర్భంగా ఫిలిప్స్కు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తెలిపారు.
previous post
మోదీ కారణంగానే చంద్రయాన్-2లో వైఫల్యం.. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు