telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా..నేను బాధపడను..

తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. ఇవాళ రాజ్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె ప్రసంగించారు.

రాష్ట్రానికి సేవ చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు అవకాశం కల్పించారని గవర్నర్ తమిళిసై అన్నారు.

రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ‘‘నేను బాధపడను.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నా సేవ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నా అని అన్నారు. రాష్ట్రానికి గవర్నర్ కాదు…. మీ అందరి సహోదరిని… ఎవ్వరు ఆపినా కూడ మీ అందర్ని కలుస్తున్నాఅని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు.తెలంగాణ గవర్నర్ గా తాను రాష్ట్రంలో చేసిన కార్యక్రమాలను ఆమె వివరించారు. ఆదీవాసీలతో సహపంక్తి భోజనాలతో పాటు వారి జీవనస్థితిగతులను పరిశీలించినట్టుగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

ముందుగా ఇదే వేదికగా గవర్నర్‌ తమిళిసై పుట్టిన రోజు వేడుకలు కూడా జరిగాయి. కేక్‌ కట్‌ చేసిన సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించారు.

Related posts