హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రయాణ సమయంలో వినోదం కోసం జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ జీ5 యాప్ ద్వారా మెట్రో సర్వీసుల్లో నచ్చిన గేమ్లు, సినిమాలను వీక్షించే వెసులుబాటు కల్పిస్తోంది. మంగళవారం నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు ప్రయాణికులు తమ ఫోన్లోని డేటాను వినియోగించాల్సిన అవసరం లేదు.
మెట్రో సంస్థనే ప్రత్యేక వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి, నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు ప్రయాణించే ప్రయాణికులంతా ఈ సేవల అందుబాటులో ఉంటాయి. దశలవారిగా అన్ని స్టేషన్లకు ఈ సేవలు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.