హైద్రాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుడిపై కరోనా అనుమానితుడి దాడికి పాల్పడ్డాడు. ఐసోలేషన్ వార్డులో డాక్టర్ నిఖిల్పై కరోనా అనుమానితుడు దాడి చేశాడు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై ఉస్మానియా సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరోనా బాధితుల బంధువులు ఆసుపత్రి వార్డుకు ఎక్కువగా రాకుండా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ కోరారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రి డీఎంఈ రమేష్రెడ్డితో డీసీపీ రమేష్ భేటీ అయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిలో తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు.