*తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్తో భేటీ..
*దేశ రాజకీయ పరిస్థితులపై చర్చ ..
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్తో భేటీ అయ్యారు. హస్తినలోని కేసీఆర్ ఇంట్లో సమావేశమై.. దేశంలోని తాజా దేశ రాజకీయా పరిస్థితులపై చర్చిస్తునున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు, ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
అఖిలేశ్తో భేటీ అనంతరం కేసీఆర్ దిల్లీలోని మొహల్లా క్లినిక్ను సందర్శించనున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్తో కలిసి క్లినిక్ సందర్శిస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్కు కేసీఆర్ వెళ్లనున్నారు.
గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు.
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్లతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొంటారు.