మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు 2008 లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయితే 2018 లో జరిగిన ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్ అధినేత కనకారెడ్డికి కాదని చామకూర మల్లారెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారు. స్వతహాగా కనకారెడ్డి ద్రాక్షతోటల పెంపకంపై అధిక శ్రద్ధ వహించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ద్రాక్ష పెంపకందారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు కనకారెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
ప్యాకేజీల కోసమే టీడీపీ నేతలపై రోజా వ్యాఖ్యలు: పంచుమర్తి అనురాధ