ఉత్తరప్రదేశ్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని సంభాల్ జిల్లాలో వివాహ వేడుకలకు వెల్లివస్తూ తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తున్న ఓ మినీ వ్యాన్ ను సరుకులు తరలిస్తున్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది పరిస్తితి విషమంగా ఉంది.
వివాహానికి వెళ్లి వస్తున్న మినీ వ్యాను అలీగఢ్-అగ్రా రహదారిపై అటుగా వెళుతున్న లారీని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాను నుజ్జునుజ్జు అయిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.