*హైదరాబాద్లోని జీడిమెట్లలో భారీ పేలుడు
*ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు..
*4ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది
హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీధర్ బయోటెక్ అనే రసాయన పరిశ్రమలో పేలుడు జరిగింది.
ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని శాపూర్నగర్లోని రామ్ ఆసుపత్రికి తరలించారు. కెమికల్ ప్రాసెస్ చేస్తుండగా రియాక్షన్ అయ్యి ప్రమాదం జరిగినట్లు సమాచారం .
ఐదు రియాక్టర్లు ఒక్కసారిగా పేలడంతో 3 ముగ్గురికి గాయాలు అయ్యాయి. పేలుడు ధాటికి పెద్ద శబ్దం రావడతో స్దానికులు భయాందోళనలతో రోడ్డుపైకి పరుగులుతీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
పొగ చుట్టుపక్కల వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారు – గాయపడిన కార్మిరులు: 1) లక్ష్మణ్ నాయుడు, 2) వెంకట రమణారెడ్డి, 3) ప్రవీణ్, 4) కృష్ణ రెడ్డి, 5) జమీర్ (37), 6) నరసింహ రావు (45), 7) శంకర్ (26)గుర్తించారు