మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణలో రాజకీయ హీట్ పెంచాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో సహా.. కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు.
ఆదివారం మునుగోడు నియోజకవర్గంలో జరిగిన బీజేపీ బహిరంగసభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమిత్షా పర్యటన సందర్భంగా ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని సందర్శించారు. ఆ సమయంలో పూజలు చేసి గుళ్లో నుంచి బయటకు వచ్చిన అమిత్షా చెప్పులను బండి సంజయ్ చేతితో తీసి అందించారు.
ఇది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.ఈ వీడియోతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయంది. దీనిపై ప్రత్యర్థులు కామెంట్స్ జోరు పెంచారు. ఓవైపు టీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ విమర్శలకు పని చెప్పాయి..
దీనిని షేర్ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ? అంటూ బండి సంజయ్ను ప్రశ్నిస్తున్నారు. భవిషత్తులో అమిత్ షా కాళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెడతారనడానికి ఈ ఘన ఉదాహరణ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఎందుకింత బానిసత్వం? అంటూ బండి సంజయ్ను ట్రోల్ చేస్తున్నారు.
ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉందని తన ట్విట్ట్లో రాసుకొచ్చారు.
ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది.
జై తెలంగాణ! https://t.co/SpFCHAszYe
— KTR (@KTRTRS) August 22, 2022
అటు కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందిస్తోందీ . బానిస రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. అమిత్షా చెప్పులను బండి సంజయ్ మోశారని అన్నారు. ఈ చర్యతో తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించపరిచరాని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలి -కేటీఆర్