ఎనిమిదేళ్ల కుమారుడు కన్నతండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి కొడుతున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆ బాలుడు ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వర్ని మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు తన తండ్రి నిత్యం అకారణంగా కొడుతూ, తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
బాలుడి కుటుంబ సభ్యులను ఠాణాకు పిలిపించిన ఎస్సై కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా, బాధపెట్టకుండా చూసుకుంటామని తండ్రి చెప్పడంతో వదిలిపెట్టారు. అనంతరం బాలుడిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.
టీడీపీ నేతలు ఆ నిధులను కూడా మింగేశారు: విజయసాయిరెడ్డి