అసోంలోని బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉదల్గురి జిల్లాలో జాతీయ రహదారి 15పై ఓరాంగ్ గెలబిల్ ఏరియా వద్ద కారు – ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై అసోం సీఎం సర్బానంద సోనోవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇంత జరుగుతున్నా జగన్ లో చలనం లేదు: చంద్రబాబు