telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీ నేతల .. హౌస్ అరెస్టులు..

TDP Change Puthalapattu Candidate

గుంటూరు జిల్లాల్లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనకు పలువురు తెదేపా నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైతులు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమం భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధం అయ్యింది. పోలీసులు చిన కాకాని ,కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్‌బాస్కో స్కూల్‌ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మంగళగిరిలో తెదేపా నేత గంజి చిరంజీవి, తాడేపల్లి రూరల్‌ అధ్యక్షుడు కొమ్మారెడ్డి నాని, పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావును గృహనిర్బంధంలో ఉంచారు. తాడేపల్లి పట్టణ, రూరల్‌ తెలుగుదేశం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts