telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మహిళల్లో ఆనందం నిపేందుకే మద్యపాన నిషేధం: మంత్రి అవంతి

మహిళల్లో ఆనందం నిపేందుకే రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు జరగనుందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్షరాస్యతలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం అని చెప్పారు. ఇళ్లు పేరిట టీడీపీ నాయకులు పేదలను దోచుకున్నారని విమర్శించారు. పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమన్నారు.

పారదర్శకంగా అర్హులకు సచివాలయంలో ఉద్యోగాలిచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.అమరావతిలో పనులు ఆగలేదని, అవినీతి మాత్రమే ఆగిందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేసేందుకు కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Related posts