ఆంద్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్నభర్తే కాలయముడై భార్యపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.
వివర్లాలోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని భరణికోట కాలనీ అనే గిరిజన తండాలో వెలుగులోకి వచ్చింది. భరణికోట కాలనీకి చెందిన జగ్గరావు, సవర పద్మ(33) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. భార్యపై అనుమానంతో జోగారావు రోజూ మద్యం సేవించి, ఆమెపై వేధింపులకు పాల్పడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అప్పటికే మత్తులో ఉన్న జగ్గరావు తన వద్దనున్న నాటు తుపాకీతో పద్మను కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.
కాగా.. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పులు జరిపిన అనంతరం జోగారావు పరారైనట్లు తెలుస్తోంది. ఆ దుండగుడిని కఠినంగా శిక్షించాలని పద్మ తరపు బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.