నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుముల మండలం తెట్టేకుంట గ్రామంలో ఇద్దరు ప్రేమికులు కొండల్(22), సంధ్య(19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వీరి ప్రేమకు ఒప్పుకోకపోవడంతో మూడు రోజుల క్రితం తెట్టేకుంట సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స పొందుతూ యువతీ యువకుడు మృతిచెందారు.
వివర్లాలోకి వెళితే..
ప్రియురాలి సంధ్య పెళ్లి నిశ్చయం…వీరిద్దరూ గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. సంధ్యకు ఇటీవల వేరొకరితో పెళ్లి నిశ్చయమైంది. మనస్తాపం చెందిన ప్రేమజంట… అబ్బాయి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
వీరిని గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమికుల మృతితో తెట్టెకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.