హయత్ నగర్ పీఎస్ పరిధిలోవరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. లాక్డౌన్లోనూ చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు.లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామంటున్న పోలీసులు.. అదే టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి. మూడు ఇళ్ళలో వరుస చోరీలు.. మరో ఇంట్లో చోరీ అటెంప్ట్.. జరిగింది. అలజడి కావడంతో పారిపోయిన దొంగలు..బంగారం, వెండి, నగదును దోచుకెల్లారు. పక్కింటి వాళ్ళు బయటికి రాకుండా తలుపులకు గడియ బిగించారు దొంగలు.
దొంగలకు చెందిన బ్లాంకెట్, టవల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వరుస చోరీలతో భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు…పదిహేనేళ్ళలో ఇదే మొదటిసారి జరిగిందంటున్నారు కాలనీ వాసులు. పెట్రోలింగ్ లేకపోవడం, పోలీసుల నిఘా కరువవడంతోనే చోరీలు జరుగుతున్నాయంటున్నారు స్థానికులు.కాలనీల్లో పెట్రోలింగ్ పెంచాలనీ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబు గజదొంగ..కేసీఆర్, కేటీఆర్ మంచివారు: మోహన్బాబు