ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ను ఈరోజు ఉదయం పోలీసులు కడప కోర్టులో హజరు పరిచారు. కొన్ని రోజుల క్రితం ముంబైకి చెందిన ఫైనాన్సియర్ను మోసం చేశాడనే ఆరోపణలతో బండ్ల గణేష్పై ముంబై కోర్టులో కేసు నమోదైంది. కేసును పరిశీలించిన ముంబై కోర్టు వారెంట్ను ఇష్యూ చేసింది.
కోర్టు అరెస్టు వారెంటు జారీ చేయడంతో నిన్న బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కడప కోర్టులో హాజరు పరచాల్సి ఉండడంతో వారే కోర్టుకు తీసుకువచ్చారు. కాగా, ఈనెల ఐదవ తేదీన బండ్ల గణేష్ తన అనుచరులతో తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశాడని విజయవాడకు చెందిన వైసీపీ నేత పీవీపీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా వరుస కేసులతో గణేష్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.