telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారు: మంత్రి ఎర్రబెల్లి

Minister Erraballi comments Congress

తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యంతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి మీడియాతో రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఇది కేవలం హుజూర్ నగర్ ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని, కేసీఆర్ వెంట ప్రజలు ఉన్నారనడానికి సూచిక అని తెలిపారు.

కేసీఆర్ చేస్తోన్న మంచి పనులను ప్రజలు గ్రహించారని ఎర్రబెల్లి అన్నారు. చిన్న ఘటనలను కూడా పెద్దవిగా చూపి దుష్ప్రచారం చేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు సహించరని చెప్పుకొచ్చారు. రాష్ట్ర సర్కారును ఇబ్బంది పెట్టేందుకు కొందరు చాలా ప్రయత్నాలు చేశారని, విపక్షాలు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు.

Related posts