telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై…

ఐపీఎల్ 13 వ సీజన్ లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య దుబాయ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 మ్యాచ్ లు ఆడి 4 మ్యాచ్ లలో విజయం సాధిస్తే, కోల్ కతా జట్టు 12 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోల్ కత జట్టు గెలిస్తే ప్లే ఆఫ్ ఆవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది. కానీ ఇప్పటికే ఆ రేస్ నుండి తప్పుకున్న చెన్నై చివర్లో మ్యాచ్ లు విజయం సాధించి లీగ్ పరువుగా ముగించాలనుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. చెన్నై జట్టు టాస్ ను గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దుబాయ్ స్టేడియం భారీ స్కోర్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసే జట్టు తప్పనిసరిగా భారీ స్కోర్ సాధించాల్సి ఉంటుంది.

కోల్‌కత : శుబ్మాన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (w), ఇయాన్ మోర్గాన్ (c), రింకు సింగ్, సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి

చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w/c), ఎన్ జగదీసన్, సామ్ కర్రన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, కర్న్ శర్మ, దీపక్ చాహర్, లుంగి ఎన్గిడి

Related posts