telugu navyamedia
రాజకీయ వార్తలు

మన్మోహన్ పాకిస్తాన్‌ పర్యటన ఖరారు

Congress manmohan

మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నవంబర్‌ 9న పాకిస్తాన్‌ వెళ్లనున్నారు. చారిత్రక కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. కర్తార్‌పూర్‌ గురుద్వారను సందర్శించే తొలి యాత్రికుల బ్యాచ్‌లో నవంబర్‌ 9న పాల్గొనేందుకు పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఆహ్వానాన్ని మన్మోహన్‌ అంగీకరించారు.

సుల్తాన్‌పూర్‌ లోధిలో భారత్‌ సరిహద్దు వద్ద జరిగే ప్రధాన కార్యక్రమంలోనూ మన్మోహన్‌ పాల్గొంటారు. కర్తార్‌పూర్‌ను సందర్శించే తొలి యాత్రికుల జాబితాలో మన్మోహన్‌తో పాటు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, ఆయన మీడియా సలహాదారు రవీన్‌ తక్రాల్‌ తదితరులున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీని గురువారం కలిసిన పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

Related posts