దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “కార్గిల్ గర్ల్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ అమ్మడు సినిమా స్క్రిప్ట్స్ ఎంపికలో జాగ్రత్త వహించడమే కాదు ఫిట్నెస్ విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తుంటారు. తెరపై అందంగా కనిపించడం కోసం జాన్వీ జిమ్ లో చాలాసేపు కష్టపడుతూ ఉంటుంది. ఇది అలా ఉండగా జాన్వీ సౌత్లో నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ బ్యూటీని టాలీవుడ్కు పరిచయం చేసే బాధ్యతను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసుకున్నారని టాక్. ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ అందుకున్న పూరి, తన నెక్ట్స్ సినిమాను విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే జాన్వీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు జాన్వీ కపూర్ కూడా గతంలో సౌత్ హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా జాన్వీ తెలుగులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ నిజం కాలేదు. ఇప్పుడు మరోసారి విజయ్తో జాన్వీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
previous post
next post
ఆ సినిమా కథ విని దర్శకుడిని తిట్టేశా.. : సంగీత