telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైద‌రాబాద్ నారాయ‌ణ కాలేజ్‌లో దారుణం : ప్రిన్సిపాల్ రూమ్ లో నిప్పంటికున్న విద్యార్ధి

*రామాంత‌పూర్ నారాయ‌ణ కాలేజ్‌లో హైటెన్స‌న్‌
*ప్రిన్సిపాల్ రూమ్ లో నిప్పంటికున్న విద్యార్ధి
*ప్రిన్సిపాల్ ను విద్యార్ధి ప‌ట్టుకోవ‌డంతో ఇద్ద‌రికీ గాయాలు
*ఫీజు ,టీసీ, విష‌యంలో విద్యార్ధి, ప్రిన్సిపాల్ మ‌ధ్య వాగ్వాదం
*ఇద్ద‌రినీ గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన నారాయ‌ణ కాలేజ్‌ సిబ్బంది

హైద‌రాబాద్ రామాంత‌పూర్ నారాయ‌ణ కాలేజ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫీజుల విషయంలో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ గదిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వివ‌రాల్లోకి వెళితే

రామాంతాపూర్ లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు టిసి కోసం ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డిని అడిగాడు. ఫీజు బకాయిలు ఉండటంతో టిసి ఇవ్వాడానికి కళాశాల సిబ్బంది నిరాకరించారు. ఇదే విషయంపై విద్యార్థులు, ప్రిన్సిపల్ కు మధ్య వాగ్వాదం జరిగింది.

టిసి ఇవ్వడం లేదనే బాధతో విద్యార్థి నారాయణ స్వామి ప్రిన్సిపల్ గదిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అదే సమయంలో అక్కడున్న ప్రిన్సిపల్ తో పాటు మరో వ్యక్తి అశోక్ రెడ్డిని పట్టుకోవడంతో విద్యార్థి నారాయణ స్వామితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఈ ఘటనలో కాలిన గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కాలేజీ సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలించారు.  కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts