హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 944.7 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. చిన్న చిన్న పొట్లాలుగా కట్టి కొబ్బరికాయల లోడ్లో తరలిస్తున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.1.88 కోట్లుగా సమాచారం.
భద్రాచలం నుంచి సంగారెడ్డి వైపు తరలిస్తుండగా మాటువేసి అధికారులు పట్టుకున్నారు. నగరం నుంచి గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు కొత్త మార్గాలను అన్వేశిస్తునట్టు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా కొబ్బరికాయల లారీలో తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. కార్గో లారీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సలహాలు ఇస్తుంటే వైసీపీ నేతలు ఎదురుదాడి: చంద్రబాబు