విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లైగర్. ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.
ఈ క్రమలంఓ దేశవ్యాప్తంగా లైగర్ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ముంబై నుంచి ఇండోర్ వరకు విజయ్ దేవరకొండ, అనన్య పాండేకు ప్రేక్షకులు, సినిమా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అయితే తెలుగు ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఫ్యాన్డమ్ టూర్లో భాగంగా వరంగల్లో ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ తర్వాత విజయ్ దేవరకొండ, అనన్య పాండే తెలుగు మీడియా సమావేశం నిర్వహించారు.
అయితే హైదరాబాద్ మీడియా సమావేశంలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బాలీవుడ్కు వెళ్లినందున గతంలో మాదిరిగా మీరు మీ యాటిట్యూడ్తో మాట్లాడటం లేదు అని అడిగితే.. నాకు అలాంటి ఫీలింగ్ లేదు. నేను కూడా ఫ్రీగా మాట్లాడుతాను. మీరు కూడా ఫ్రీగా మాట్లాడండి అంటూ కాలు మీదు కాలు వేసుకొని.. టేబుల్పై కాళ్లు పెట్టి ఫన్నీగా మాట్లాడారు.
అయితే ఈ సంఘటనపై విజయ్ దేవరకొండకు యాటిట్యూడ్ పెరిగిపోయింది. మీడియాతో ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యవహరించారు అని కొన్ని వెబ్ సైట్లలో ఆ ఫోటోను పోస్ట్ చేసి కథనాలు రాశారు. ఈ ఘటనపై విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించారు.
ఏదైనా రంగంలో ఒకరు ఎదుగుతున్నారంటే.. వారిని కాళ్లు పట్టి లాగేందుకు కుట్రలు పన్నడం సహజం. స్వయంకృషితో ఎదిగే వాళ్లను టార్గెట్ చేయడం జరగడం కొత్తేమీ కాదు. ఇలాంటి విషయాలపై గట్టిగానే ఫైట్ చేస్తాం అని విజయ్ దేవరకొండ ట్వీట్లో పేర్కొన్నారు.
ఎప్పుడైతే మీకు మీరు నిజాయితీగా ఉన్నప్పుడు.. ప్రతీ ఒక్కరి కోసం మంచి చేయాలనుకొంటారు. తన చుట్టు ఉన్న మనుషులను ప్రేమిస్తూనే ఉంటారు. మిగితా విషయాలను భగవంతుడే చూసుకొంటాడు. వారికి భగంతుడే రక్షణగా నిలుస్తాడు అని ట్వీట్లో వెల్లడించారు.