ఇటీవల తెరకెక్కిన ‘ఎన్జీకే’, ‘కాప్పాన్’ చిత్రాలు సూర్యకు ఆశించిన విజయాన్ని అందించలేక పోయాయి. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో ఆయన నటించిన ‘సూరరై పోట్రు’ దీపావళి సందర్భంగా నవంబర్ 12న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు ‘వాడివాసల్’ అని పేరు పెట్టారు. జల్లికట్టు నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ‘వాడివాసల్ ‘ సూర్య నటిస్తున్న 39వ చిత్రం. కాగా సూర్య నటించనున్న 40వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో సూర్య రాజకీయ నాయకుడి పాత్రలో నటించనున్నారని పాండిరాజ్ తెలిపారు.
previous post
next post