telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

లోయలో పడ్డ బస్సు..14 మంది మృతి

Accident

నేపాల్ దేశంలో అదుపుతప్పి బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 14మంది ప్రయాణికులు మరణించగా, మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్ దేశంలోని సింధూపాల్ చౌక్ ప్రాంతంలో 120 మంది ప్రయాణికులతో వేగంగా వస్తున్న బస్సు టైరు పంక్చర్ అవడంతో లోయలో పడింది.

ఈ బస్సు ప్రమాదంలో 14మంది మరణించగా, 98 మంది గాయపడ్డారని సింధూపాల్ చౌక్ డీఎస్పీ మాధవరాజ్ కాఫ్లే చెప్పారు. క్షతగాత్రులను ధూలీఖేల్, షీర్ మెమోరియల్, ఖాట్మాండ్ ఆసుపత్రులకు తరలించారు. బస్సు ఓవర్ లోడ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Related posts