తెలంగాణ బంద్కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాలు హెచ్చరికలతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు.