telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

న్యూజిలాండ్ ను మట్టికరిపించిన.. భారత్.. లక్ష్యం 158 పరుగులే..

india newzeland odi 2019

నేపియర్ లో ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 157 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. కుల్ దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి రాణించగా, ఆట ఆరంభంలో మహమ్మద్ షపీ ప్రధాన ఆటగాళ్లను దెబ్బతీసేలా 3 కీలక వికెట్లు తీశాడు. చాహాల్ కు 2, జాదవ్ కు 1 వికెట్ లభించింది.

64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్ కుల్ దీప్ బౌలింగ్ లో శంకర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన తరువాత న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎంతోసేపు నిలదొక్కుకోలేదు. 145 పరుగుల వద్ద 6 వికెట్లతో ఉన్న జట్టు మరో 12 పరుగులు జోడించేలోపే చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది. మరికాసేపట్లో 158 పరుగుల విజయలక్ష్యంతో భారత జట్టు మైదానంలోకి దిగనుంది.

Related posts