ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ “సరిలేరు నీకెవ్వరు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. బండ్ల గణేష్, విజయశాంతితో పాటు పలువురు సినీ నటులు చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అయితే మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరులోను తమన్నా స్పెషల్ డ్యాన్స్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా… వెకేషన్స్లో ఫ్యామిలీతో చక్కర్లు కొట్టే మహేష్ బాబు దసరా హాలీడేస్కి స్విట్జర్లాండ్ వెళ్ళారు. టూర్ పూర్తి కావడంతో తన కొడుకు గౌతమ్, భార్య నమ్రతతో దిగిన ఫోటోస్ షేర్ చేస్తూ..బ్యాక్ టూ వర్క్ అండ్ స్కూల్ అని పోస్ట్ చేశారు. అంతేకాక ఈ ప్రయాణం తర్వాత పోలరాయుడ్కి ఫ్యాన్ అయ్యాను. 42వేల అడుగుల ఎత్తులో ప్రయాణం బాగుంది అని తన కామెంట్లో పేర్కొన్నారు.
I’m a fan of Polaroid’s after this one 😊😊!!! Flying high at 42000ft ✈ #inflightclicks #enroutehome pic.twitter.com/82jT0eixph
— Mahesh Babu (@urstrulyMahesh) 11 October 2019