ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా ప్రచారం ఊపందుకొంటున్న విశాఖపట్నం నగరానికి సీఎం జగన్ విచ్చేశారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి కైలాసగిరి వరకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవంతో పాటు అనేక అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన ఆయనకు జనం నీరాజనం పలికారు.
రోడ్డుకిరువైపుల సుమారు 27 కిలోమీటర్ల వరకు మానవహారంలా ఏర్పడిన ప్రజలను సీఎం జగన్ తన కాన్వాయ్ నుంచి వీక్షించారు. ఈ క్రమంలో జగన్ ఉన్న కారును గుర్తించిన ప్రజలు ఆయనతో సెల్ఫీల కోసం ముందుకు ఉరకడంతో పోలీసులు వారిని అడ్డుకోవలసి వచ్చింది.