telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారు: బండి సంజయ్

BJP Bandi sanjay

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీ బండి సంజయ్, వివేక్, పొంగులేటి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు.

కేసీఆర్ అనే మూర్ఖుడి చేతిలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని అన్నారు. తెలంగాణలో కేంద్ర పథకాలు మాత్రమే అమలవుతున్నాయని బండి సంజయ్‌ తెలిపారు. కమీషన్ల కోసం ఇద్దరు సీఎంలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. కేసీఆర్ గడీలు బద్దలు కొట్టడానికి బీజేపీ మలిదశ ఉద్యమం చేపడుతుందన్నారు.

Related posts