telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాట తప్పిన చంద్రబాబును రైతులు నిలదీయాలి: జయసాయి రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారు. ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారు. తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గు లేకుండా డిమాండు చేస్తున్నారు. మాట తప్పిన చంద్రబాబును రైతులు నిలదీయాలని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ముందే తెలుసునని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఓటమి తప్పదని గ్రహించే లోకేశ్ చేత ఎమ్మెల్సీకి రాజీనామా చేయించకుండానే మంగళగిరి నుంచి బరిలో దింపారని విజయసాయి రెడ్డి ట్విటర్ లో ఆరోపించారు.

Related posts