తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.92 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 267 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. ఇదే సమయం లో 351 మంది కోలుకున్నారు. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,395కు చేరుకోగా… 2,86,893 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,583 మంది కరోనాతో మృతి చెందారు. ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 98.11 శాతంగా ఉంటే.. భారత్లో 96.7 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 3,919 యాక్టివ్ కేసులు ఉండగా… వీరిలో 2,270 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇక నిన్న రాష్ట్రవ్యాప్తంగా 27,471 శాంపిల్స్ టెస్ట్ చేశామని అధికారులు పేర్కొన్నారు.
previous post
next post