telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇళ్ల నిర్మాణాల ఖర్చు ప్రభుత్వానిదే: పురందేశ్వరి

daggubatipurandeswari

పేదల ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని మరచిపోయారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

ఇళ్ల నిర్మాణ విషయంలో తానిచ్చిన హామీని జగన్ నిలుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి విషయానికి వస్తే, 300చ.అ. ఇళ్ళ నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తి గా తమ ప్రభుత్వమే భరిస్తుందని ఇచ్చిన హామీని జగన్ పూర్తిగా మర్చిపోయారన్నారు.

Related posts