ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టింది ఓ చిట్ఫండ్ సంస్థ. వందలాది మంది ఖాతాదారుల నుంచి దాదాపు 20 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు కేందంగా ఏసీఆర్ చిట్పండ్ ను కొందరు వ్యక్తులు నిర్వహిస్తున్నారు.
ప్రజల్లో నమ్మకంగా వ్యవహరించడంతో పలువురు వీరి వద్ద చీటీలు కట్టారు. తీరా డబ్బు చెల్లించాల్సిన సమయానికి నిర్వాహకులు పరారు కావడంతో ఖాతాదారులు బోరున విలపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇదిలావుండగా పెద్దమొత్తంలో డబ్బుకట్టి నష్టపోయిన ఓ బాధితుడు ఆత్మహత్యా యత్నం చేశాడు.