telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనాకు ఔషధాన్ని సిద్ధం చేశాం..బాబా రామ్ దేవ్ సంచలన ప్రకటన

Ramdev baba

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు పరిశోదనలు చేస్తున్న నేపథ్యంలో ప‌తంజ‌లి సంస్థ వ్యవస్థాపకుడు బాబా రామ్ ‌దేవ్ సంచలన ప్రకటనను చేశారు. క‌రోనాను ఎదుర్కోగల ఔషధాన్ని సిద్ధం చేశామని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖను రాశారు. గిలోయ్, అశ్వగంధ కాంబినేష‌న్ తో క‌రోనాకి చికిత్స చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

కరోనా వైరస్ శరీరంలోకి వెళితే, మొత్తం కణజాల వ్యవస్థపై ప్రభావం చూపి, వాటిని నాశనం చేస్తున్నదని తెలిపారు. తాము తయారు చేసిన ఔషదం శరీరం లోపల సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో 100శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని తెలిపారు. అశ్వగంధ, గిలోయ్ తులశివతిలతో దీన్ని తయారు చేశామని తెలిపారు.

రోగులకు ఖాళీ కడుపుతోనూ, తిన్న తరువాత కూడా ఇచ్చి పరీక్షలు చేశామని ఆయన అన్నారు. తాము ఇప్పటికే 100 శాతం రికవరీ, జీరో శాతం మరణ రేటు నమోదు చేశామని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం క్లినికల్ కంట్రోల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు.

Related posts