telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

జనగామ జిల్లా కేంద్రంలో దారుణం…

జనగామ మాజీ కౌన్సిలర్ పులిస్వామిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.  జనగామ కేంద్రంలోని హనుమకొండ రోడ్డు నేషనల్ వెల్ఫేర్ స్కూల్ ఎదురుగా వాకింగ్ కు వెళ్లి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. మాటువేసిన ఇద్దరు వ్యక్తులు పులిస్వామిని కిరాతకంగా దాడిచేసి హత్య చేశారు.  హత్య చేసిన తరువాత బైక్ స్టార్ట్ కాకపోవడంతో దానిని అక్కడే వదిలేసి పరారయ్యారు.  పులిస్వామి హత్య ఘటన వెనుక భూవివాదాలు కారణం అయ్యి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.  పులిస్వామి 2005లో తెలుగుదేశం పార్టీ తరపున కౌన్సిలర్ గా పనిచేశారు.  2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.  ప్రస్తుతం ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు.  ఈ ఉదయం 6 గంటల సమయంలో హత్య జరగడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.  ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వ్యక్తిగత కక్షల కారణంగానే అతడిని చంపేశారు అని స్థానికులు అంటున్నారు. అయితే వీలైనంత త్వరగా హంతకులను పట్టుకుంటాం అని పోలీసులు తెలిపారు .

Related posts