తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. జిల్లాలోని గుండాల మండలంలోని దేవెళ్లగూడెం అటవీప్రాంతంలో మావోయిస్టుల సంచారం గురించి సమాచారం అందుకున్న పోలీసులు దేవెళ్లగూడెం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు.
పోలీసులను చూసిన మావోలు కాల్పులు ప్రారంభించగా, అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ ఘటనతో మరింత అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మావోల ఎరివేత కోసం అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు.