telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు: ఏచూరి

seetharam echury cpm

ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విటర్ లో విమర్శించారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టవిరుద్ధమైన చర్యలు చేపడుతోందని విమర్శించారు. ఢిల్లీ అల్లర్లుకు బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ప్రధాని మోడీ, బీజేపీ నిజస్వరూపానికి తాజా చర్యలే నిదర్శనమని ఏచూరీ అన్నారు. శాంతియుత నిరసనలను అడ్డుకుంటున్నారు. రాష్ట్రాల అధికారాలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను అణచివేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కూడా కేంద్రం ఆధీనంలోనే పని చేస్తున్నారని ఏచూరీ విమర్శించారు. కేంద్రం అవలంభిస్తున్న రాజ్యంగ వ్యతిరేక చర్యలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Related posts